<img src="https://sb.scorecardresearch.com/p?c1=2&amp;c2=20416623&amp;cv=4.4.0&amp;cj=1">

దివ్యదర్శనం టోకెన్ల జారీకి.. భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాట్లు 495j65

mkjhyzt
xabt

దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. 1i486l

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 05 Jun 2025 07:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన దివ్యదర్శనం ఫ్లెక్సీ

తిరుపతి, ఈనాడు: దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఉద్దేశించిన ఈ టోకెన్లను ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేయనున్నారు. భక్తులు గతంలో మొదటి మెట్టు సమీపంలో టోకెన్లు తీసుకొని 1,200వ మెట్టు వద్ద స్కాన్‌ చేసుకునేవారు. ఈ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను గమనించిన అధికారులు దివ్యదర్శన టోకెన్ల జారీకి శ్రీనివాసమంగాపురం వద్ద శాశ్వత కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు అందించనున్నారు. ఇక్కడ మొత్తం 10 కౌంటర్లు ఉండగా 4 దివ్యదర్శనం, 6 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. ముందుగా బాలాజీ బస్టాండ్‌ ఆవరణలోని షెడ్లలోకి భక్తులను అనుమతించి క్యూలైన్లలోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు.

భూదేవి కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కౌంటర్లు

Tags :
Published : 05 Jun 2025 07:35 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని 49511